Monday, 11 February 2019

ట్రంప్‌కి కేఏ పాల్ వార్నింగ్.. మీడియాపై చిందులు!


praja shanti party president paul warns us president donald trump
ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా, భారతీయ విద్యార్థుల నిర్బంధం విషయంలో ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని ఫార్మింగ్టన్ అనే నకిలీ విశ్వవిద్యాలయం కేసులో అరెస్ట్‌చేసిన భారతీయ విద్యార్థులను కొన్ని గంటల్లోనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తాను చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని ట్రంప్‌ను హెచ్చరించడం గమనార్హం. అంతేకాదు, తాము తీసుకునే చర్య ట్రంప్‌నకు ఎంతమాత్రం రుచించబోదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ మోగడంతో పాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆపండి అది అంటూ చేతితో గట్టిగా భుజంపై తట్టారు. 

అంతేకాదు, తాను అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నానని, మీడియా ప్రతినిధులు అందరూ తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి రావాలని సూచించారు. తన మాటలు లైవ్‌లో వస్తున్నాయని, తాను ప్రపంచ నాయకుల గురించి మాట్లాడుతున్నానని పాల్ మండిపడ్డారు. అలాగే తాను ఒకటి మాట్లాడితే, కొంతమంది స్టుపిడ్, ఈడియట్ మీడియా రకరకాల హెడ్డింగులు పెడుతున్నారని, తమ పాపులారిటీ కోసం మార్చి రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ విషయంలో ఆయన స్పందించినందకు హృద‌య‌పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

No comments:

Post a Comment